Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకు ండా కురిసిన వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు.శనివారం మండలంలోని కొరటికల్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి నీటమునిగిన పత్తిచేలను ఆయన పరిశీలించి మాట్లాడారు.జిల్లాలో సుమారు ఏడు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా లక్షా25 వేల ఎకరాలలో పత్తిపంటకు నష్టం వాటిల్లిం దన్నారు. పంటచేతికొచ్చే సమయంలో పత్తి తడవడంతో నల్లగా మారిందన్నారు.ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటను అధికారులతో అంచనా వేయించి రైతులకు పత్తికి ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, మండల కార్యదర్శి మిర్యాలవెంకన్న, బి.సత్తయ్య, ఎం.యాదయ్య, బొల్లం సాయిలు, అయితరాజువెంకన్న, బొల్లం కృష్ణయ్య పాల్గొన్నారు.