Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దామరచర్ల
వరదల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని మూసి పరివాహక గ్రామమైన కేశవాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని పలు గ్రామాలలో వరదల వలన నష్టపోయిన వరి చేలను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మూసి నదికి వరదలు రావడంతో సమీపంలోని పంట చేలు నీట మినిగిపోయినట్టు చెప్పారు. పంట చేతికి వచ్చే సమయంలో వరద పంటను ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు.ఎకరానికి రూ.30 నుండి 40 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నట్టు చెప్పారు.మరి కొందరు రైతులకు చెందిన పైప్ లైన్లు ,మోటార్లు ,వైర్లు కూడా వరదల్లో కొట్టుకొని పోయినట్లు చెప్పారు. ఫలితంగా ఒకొక్కరు సుమారు రూ.50 వేల వరకు నష్టపోయినట్టు చెప్పారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్,ధరణి పనులను నిలిపివేసి ,గ్రామాల వారిగా పంట నష్టం అంచనాలు వేసి ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు. ఎస్సై ,ఎస్టీ ,బీసీ రైతులకు ఆయా కార్పొరేషన్ల నుండి ఉచితంగా పైప్ లు ,మోటార్లను పంపిణీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్ ,రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు ,రవినాయక్ ,మండల కార్యదర్శి ఎర్రా నాయక్ ,దాయనంద్ ,శ్రీను ,రైతులు నాగు ,రవి ,శ్యామల తదితరులు పాల్గొన్నారు.