Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మిస్సింగ్ కేస్ ఆధారంగా హత్య కేసును రూరల్ సర్కిల్ పోలీసులు చేధించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.రూరల్ సీఐ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ రఘు వివరాలను వెల్లడించారు.మేళ్లచెర్వు మండలం వేపలమాధారం గ్రామ శివారులో రఘునాధపాలెం మార్గంలో మహిళ శవం సగం కాలిన పుర్రె, వెంట్రుకలు, వెన్నెముక ముక్క మాత్రమే ఉండి గుర్తు తెలియకుండా ఉంది. తేది: 11 /11/2018 రోజున వేపలసింగారం గ్రామ వీఆర్వో మేళ్లచెర్వు అక్కడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాపు చేస్తున్నారు. 2/11/2019 రోజున తన భార్య కనిపించడం లేదని ఆమె రెండో భర్త సైదారావు మఠంపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ భాస్కరన్ దర్యాప్తులో ఉన్న పెండింగ్ కేసుల పరిశీలనలో ఈ రెండు కేసులపై ప్రత్యేక దష్టి పెట్టి కేసులను చేధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల ప్రకారం మొదట గా మఠంపల్లి మిస్సింగ్ కేసుకు సంబంధించి వివరాలను తెలుసుకునే దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా ఆస్తి విషయంలో తన తల్లికి రావాల్సిన డబ్బులు ఇవ్వడంలేదని, ఎలాగైనా చంపి తన పిన్ని డబ్బులు, ఆస్తి కాజేయాలని పథకం ప్రకారం తన పిన్ని అయిన మరియపాపులు ఇంటికి స్వప్న వెళ్ళి గొడవపడి గొంతు నులిమి హత్యచేసి, మతు రాలు ఇంటినుండి తీసుకుపోయిన బ్యాంక్ పాస్బుక్లు, ఏటీిఎం కార్డులు, ఇంటికి సంబందించిన కాగితాలు అన్నీ కూడా స్వప్న ఇంట్లో దొరికాయి.ఎస్పీ ఆదేశాల మేరకు కోదాడ రూరల్ సీఐ హత్యకు గురైన మహిళా శవం నుండి డీఎన్ఏ తీసి మరియపాపులు కొడుకు అయిన పూజిత్రెడ్డి డీఎన్ఏతో పోల్చడం వల్ల రెండు ఒకటేనని రావడం వల్ల చనిపోయింది మరియ పాపులే అని, ఆమెకు గల ఆస్తి తగాదాల కారణంగా ఈ కేసులో పురోగతి సాధించారు. అన్నెం స్వప్న పై, ఆమె మరిది రాంభూపాల్రెడ్డి, ప్రియుడు నర్సింహారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వప్న, రామ్ భూపాల్రెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.కాగా నర్సింహారావు పరారీలో ఉన్నాడు.ఈ కేసు పరిశోధనాధికారి కె. శివరాంరెడ్డి, కోదాడ రూరల్ సీఐ, ఎస్సై ఆర్.సుందరయ్యను, కేసు చేధించడానికి పనిచేసిన ఎస్. వెంకటేశ్వర్లు, జి. వీరప్రసాద్, హోంగార్డు హనుమంతరావును ఎస్పీ అభినందించారు.