Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కార్మికులను అగౌరవపరిచేవిధంగా మాట్లాడిన చైర్మెన్ ఆంజనేయులు క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపిన స్పందన లేకపోవడంతో సోమవారం నుండి స్ట్రైక్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఐఎన్టీయూసీ నాయకులు బండారు నాగేందర్, ఎండి.షరీఫ్ తెలిపారు. శనివారం భువనగిరిలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు యూసఫ్, కాంగ్రెస్ నాయకులు పొత్నక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, బట్టు రామచంద్రయ్య, పడిగేల ప్రదీప్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.