Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం
నవతెలంగాణ -రామన్నపేట
ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం అన్నారు. శనివారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్టా కష్ణారెడ్డి, విఆర్ఓ స్వామి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయి, నందీశ్వర్, సాగర్ల మల్లయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.