Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండలపరిధిలోని చెర్వుగట్టులో గల శ్రీపార్వతీ జడలరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమవాస్యను పురస్కరించుకుని లక్షపుష్పార్చన కార్యక్రమం అంగరంగవైభవంగా నిర్వహించారు.కరోనా వైరస్ నివారణలో భాగంగా దేవాలయంలో జరిగే అమవాస్య ఉత్సవాలకు భక్తులు ఐదునెలల పాటు నిషేధించి శుక్రవారం జరిగిన అమవాస్యతో నిబంధనలకనుగుణంగా అనుమతులు ఇవ్వడంతో రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు.దేవస్థాన ప్రధానార్చకులు శ్రీపోతులపాటి రామలిం గేశ్వరశర్మ,అర్చకబృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి అన్నెపర్తి సులోచన, పర్యవేక్షకులు తిరుపతిరెడ్డి, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.