Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ సాయుధ పోరాటంలో ఓంకార్ పాత్ర ఎనలేనిదని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, ఏఐఎఫ్డీడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు వస్కుల సైదమ్మ అన్నారు. ఓంకార్ 12వ వర్థంతి సందర్భంగా శనివారం స్థానిక వై జంక్షన్లో ఆయన వస్కుల గోపి అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ కమ్యూనిస్టు వ్యవస్థాపకులు, పేద ప్రజల ఆశాజ్యోతి ఓంకార్ అన్నారు. మైదాన ప్రాంతాల్లో రజాకార్ల యూనియన్ మిలటరీ తీవ్ర నిర్బంధ కాలంలో ఓంకార్ అటవీ ప్రాంతంలో గిరిజనులతో ఆదివాసీలతో సంబంధాలు ఏర్పర్చుకొని వరంగల్ జిల్లా నుంచి మొదలుకొని ఆదిలాబాద్, శ్రీకాకుళం వరకూ గిరిజనులకు పెద్దన్నగా, కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకునిగా పోరాటాలు చేశారన్నారు. ఓంకార్ స్థాపించిన ఎంసీపీఐయూ దేశంలోని 20 రాష్ట్రాల్లో, రాష్ట్రంలో 25 జిల్లాల్లో నిర్మాణంతో పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి దైద రవి, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జగిరి అంజయ్య, ఏఐకేఎఫ్ జిల్లా కార్యదర్శి రెడపంగ మల్లయ్య, ఎంసీపీఐయూ జిల్లా నాయకులు వెంకన్న, రామాంజి, జ్యోతి, భరత్, మారయ్య, శేఖర్, కావమ్మ, సైదమ్మ, మమత, సోమయ్య, జనార్థన్, సందీప్, ఆశీర్వాదం, రాజు పాల్గొన్నారు.