Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
నవతెలంగాణ -భువనగిరిరూరల్ /నల్లగొండకలెక్టరేట్
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్పై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లకు ముందస్తుగా శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. అక్టోబర్ 25 నుండి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులను, సిటిజన్లు ఆన్లైన్ ద్వారా నమోదు చేసేందుకు ధరణి అందుబాటులో ఉంటుందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీనివాస్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ధరణి పోర్టల్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి
దసరా పండుగ నాడు ధరణి పోర్టల్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన కార్యాలయం నుంచి ధరణి ప్రాజెక్టు పై ఆయాజిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు,తహసీల్దార్లు,డిప్యూటీ తహసీల్దార్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ను ప్రారంభించేందుకు జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.చంద్రశేఖర్, రాహుల్శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, రోహిత్సింగ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.