Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్డి.జహంగీర్
నవతెలంగాణ -ఆలేరురూరల్
రాష్ట్రం వచ్చాక నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మాట ఏమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, పాదయాత్ర బృందం నాయకుడు జహంగీర్, పాదయాత్ర బందం సభ్యులు ఎండి.జాహంగీర్ ప్రశ్నించారు. మంగళవారం రాత్రి మండలంలోని పటేల్గూడెంలో జన చైతన్య పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉస్మానియా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెయ్యాలని కోరారు. విదేశాల్లో ఉన్న బ్లాక్మనినీ వెలికితీసి మనిషికి 15 లక్షలు బ్యాంకు అకౌంట్ లో వేస్తానని చెప్పిన మోడీ సర్కాట్ మాట ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నాలుగు నెలల నుండి రైతులు పోరాటం సాగిస్తూ 300 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎరువులు అవసరం ఉండడం గమనించి కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఐకేపీ సెంటర్లను ప్రారంభిస్తున్నామని చెప్పి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుస్తోందన్నారు. మంగళవారం జిల్లాలో భారీ వర్షానికి 7 వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బదం సభ్యులు కొండమడుగు నరసింహ, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ .మాటూరి బాలరాజ్ గౌడ్ ,ధరావత్ రమేష్ నాయక్ ,కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు, మండల కార్యదర్శి రమేష్ .గ్రామ శాఖ కార్యదర్శి పిక గణేష్ ,గ్రామ సర్పంచ్ పులగం పద్మ యాదిరెడ్డి ,మాజీ సర్పంచ్ నల్ల మాస తులసయ్య, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మకంటి లక్ష్మీ నారాయణ ,గ్యార అశోక్ ,భాస్కర్ ,లక్ష్మయ్య పాల్గొన్నారు.