Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, డీఐజీ రంగనాధ్
నవతెలంగాణ-హాలియా
జిల్లాలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని, ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలు పాటించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ రంగనాధ్ సూచించారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం సభకు వచ్చేవారు భౌతికదూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. సాగర్ ఉప ఎన్నిక జరుగుతున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు ప్రచారం, రోడ్ షోలు నిర్వహించే వారు సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి రోజూ జిల్లాలో 3500 మందికి పరీక్షలు నిర్వహిస్తే 250 నుంచి 300 మందికి పాజిటివ్ వస్తుందన్నారు. ముఖ్యంగా నల్లగొండ, మిర్యాలగూడ, నార్కట్పల్లి ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని కోరారు. ఇప్పటివరకూ కరోనా నిబంధనలు బ్రేక్ చేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్ధి భగత్కుమార్తో పాటు మరి కొంతమందిపై కేసులు నమోదు చేశామన్నారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు.