Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి శేషు, కోశాధికారి హెచ్ఎస్.గుప్త కోరారు. ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయి సంజీవని ఆస్పత్రి వారి సౌజన్యంతో గుండె, మోకాళ్లు, బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు అంజయ్య, తిరుపతిరెడ్డిలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి వైద్య శిబిరాలను విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ మధుసూదన్, సాయిరాం, గిరి, శంకర్ పాల్గొన్నారు.