Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్కు ఆల్మట్టి నుంచి 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రైతు సంఘాలు, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో తప్పుడు కేసులు పెట్టారని, వెంటనే ఎత్తివేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ ఛేశారు. బుధవారం మండల కేంద్రంలోఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను తలపించేలా ఉందన్నారు. పోలీసులు రజాకార్లలాగా వ్యవహరిస్తూ ఉద్యమకారులను, ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నారన్నారు. వెంటనే సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డిలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో టీ-మాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆడెపు నాగార్జున, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ కిషన్నాయక్, కేవీపీఎస్ జిల్లా నాయకులు దోరేపల్లి మల్లయ్య, శ్రీను, పెదనాగయ్య, ఏసు, శ్రీనివాస్ పాల్గొన్నారు.