Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న నిరసన దినం పాటిస్తున్నట్టు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం. రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం స్థానికంగా పోస్టరావిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినంగా ప్రకటిస్తూ అదే రోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయ, ఉద్యోగులు అధిక సంఖ్యలోపాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎల్. సత్యనారాయణ, నాయకులు వెంకటయ్య, మండలాధ్యక్ష కార్యదర్శులు శ్రీను, వెంకటయ్య, సీనియర్ నాయకులు తావూర్యానాయక్, గోవర్థన్రావు, రాములు, ఇద్దయ్య, లాజర్, వెంకటయ్య, కృష్ణకాంత్నాయక్, పాలేశ్వర్, లక్ష్మణ్, ఆవుల మధు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన్ :
సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న చేపట్టిన కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని టీఎస్ సీపీఎస్ఈఏ అధ్యక్ష కార్యదర్శులు నాగవెల్లి ఉపేందర్, బొమ్మనబోయిన శ్రీనివాస్ కోరారు. బుధవారం స్థానిక అమరవీరుల స్థూపం వద్ద పోస్టరావిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమం కోసం వెంటనే సీపీఎస్ను రద్దు చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని
హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, ఏపాల నరేందర్రెడ్డి, ఎమ్డి.హబీబ్, గణేశ్, శ్రీనివాసరావు, అంజయ్య, శ్రీనివాసరెడ్డి, నాగేందర్, పరమేశ్, సైదులు, దస్తగిరి, భగవాన్నాయక్, పరుశురామ్, పాల్గొన్నారు.
తపస్ ఆధ్వర్యంలో..
సెప్టెంబర్ 1న తలపెట్టిన సామూహిక సెలవుకు మద్దతునిస్తున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) మండలాధ్యక్షులు నాగేందర్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కల్గించే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పాత పెన్షన్ అమలయ్యేంత వరకూ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, శ్రీనివాస్, యామిని వెంకటేశ్వర్లు, లింగయ్య పాల్గొన్నారు.