Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు బుధవారం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. మండలంలోని గొల్లపల్లి, కురుమేడు, పీకే మల్లేపల్లి, ఎం. మల్లేపల్లి, కురుమేడు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.