Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీఐ శివరాంరెడ్డి అన్నారు. బుధవారం స్థానికంగా పోలీస్స్టేషన్ ఎదుట ఉన్న ఫంక్షన్హాల్లో ఉత్సవ కమిటీల నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పెండ్లిపాకల ప్రాజెక్టు వద్దకు తరలించాలన్నారు. డీజేలు ఉపయోగించొద్దని, మద్యం తాగి గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్మయి, వివిధ గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.