Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు నిర్లక్ష్యం వహించొద్దని ఎంపీపీ అనంతరాజుగౌడ్ అన్నారు. బుధవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రిగూడ 30 పడకల ఆస్పత్రికి రూ.2.50 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఆ నిధులతో ఆస్పత్రి అభివృద్ధిపర్చాలన్నారు. అదే విధంగా అంబులెన్స్కు డ్రైవర్ను తక్షణమే నియమించాలని, 104లో అవసరమైన మందులు ఉంచాలన్నారు. ప్రయివేటు ల్యాబ్లను ఆశ్రయించకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో తహశీల్దార్ అంబేద్కర్, ఎంపీడీఓ రామకృష్ణశర్మ, జెడ్పీటీసీ యాదయ్య, సర్పంచ్ మాసా నీలిమ, వైస్ ఎంపీపీ నర్సమ్మ, వైద్యులు సుమన్, రాజేశ్ పాల్గొన్నారు.