Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
సెప్టెంబర్ 1న సీపీఐ(ఎం) డివిజన్స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ, మండల కార్యదర్శులు నూకల జగదీశ్చంద్ర, పగిడోజు రాంమ్మూర్తిలు తెలిపారు. బుధవారం స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్ మల్లేశ్లు హాజరు కానున్నట్టు తెలిపారు. పట్టణ, మండల కమిటీలతో పాటు, శాఖ కార్యదర్శులు, పార్టీ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.