Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రిగూడ : మండల పరిధిలోని చర్లగూడెం జలాశయ పరిధిలో భూములు కోల్పోతున్న తమకు పరహారమిచ్చి పునరావాసం కల్పించాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ చేపట్టిన నిరవధిక ధర్నా బుధవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నా..ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. మల్లన్నసాగర్ మాదిరిగానే పరిహారమివ్వాలని, కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు ఐతగోని వెంకటయ్య, జితేందర్రెడ్డి, చంద్రయ్య పాల్గొన్నారు.