Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన సేవలు అంధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ గుత్తా మంజుల పేర్కొన్నారు. బుధవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అస్పత్రి అభివృద్ధి కోసం మంజూరైన నిధులను ప్రధాన్యత క్రమంలో అవసరమైన క్రమంలో ఖర్చు చేయాలని కోరారు. ప్రభుత్వం ఆర్ధికంగా వేనుకబడిర మహిళలు ప్రభుత్వాస్పత్రిలో కాన్పులు అయ్యేందుకు కేసీఆర్ కిట్టు ప్రారంభించినట్టు తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహశీల్దార్ డి కవిత, ఎంపీడీవో బి. కరుణ, మండల వైద్యాధికారులు డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ విజరుకుమార్, పిహెచ్ఓ బి. సుంధర్ నాయక్, సూపర్వైజర్ బి. జగదిశ్వర్రెడ్డి, అరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.