Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నార్కట్పల్లి
మండలంలో ఉన్న నార్కట్పల్లి, అక్కెనపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో రోగులకు వైద్యలు అందుబాటులో ఉంటు ప్రభత్వు వైద్యాన్ని బలోపేతం చేయాలని ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలపరిధిలోని నార్కట్పల్లి, అక్కెనపల్లి పీహెచ్సీలో జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీసమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కానుపైనవారికి కేసీఆర్ కిట్తోపాటు మరో రూ 12000 ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రజల మన్నన పొందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అభివృద్ధికై పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గుర్రం సురేష్, వైస్ ఎంపీపీ పుల్లంల పద్మముత్తయ్య, ఎంపీటీసీ మత్స్య ముత్యాలు, సర్పంచులు పుల్లంల అచ్చాలు, కుమారస్వామీ, రేణుక ,వైద్యాధికారులు డా. హర్ష, ప్రవీణ్రెడ్డి, కిరణ్కుమార్ పాల్గొన్నారు.