Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చిట్యాల
మండలంలోని వెల్మినేడు గ్రామ సర్పంచ్ విద్యుత్ సామాగ్రి కొనుగోళ్లలో అవినీతికి పాల్పడి పాలకవర్గ సభ్యులకు లెక్కలు చూపించకపోవడంతో బుధవారం గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామపంచాయతీ ముందు ధర్నా నిర్వహిం చారు. గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో ఎజెండా ప్రకారం జమా ఖర్చుల పై జరుగుతున్న చర్చలో భాగంగా విద్యుత్ సామాగ్రి కొనుగోలుపై జరిగిన అవకతవకల గురించి పాలక వర్గం సర్పంచ్ను ప్రశ్నించిన ప్పటికి సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు లెక్కలు చూపించక పోవడంతోపాటు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులను నిలిపివేస్తానని హెచ్చరించడం ఆయన నియంతృత్వపొకడకు నిరదర్శనమని సభ్యులు అన్నారు. విద్యుత్ సామాగ్రి కొనుగోల్లకు సంభందించిన బిల్లు ఆమోదించకపోతే ఎలాంటి అభివృద్ధి పనులపై తిర్మానాలు చేయనని మొండివైఖరితో కార్యదర్శికి సమావేశం ముగిసినట్టు మినెట్స్ రాయమని చెప్పడం అప్రజాస్వామికమని అన్నారు. సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడం సరికాదన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీటీసీ సభ్యులు నెలికంటి నర్సింహా, అర్రూరి శ్రీనివాసులు, గ్రామాభివృద్ధికి సర్పంచ్ పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉపసర్పంచ్ ఏనుగు మాదవి సుధాకర్రెడ్డి పాలకవర్గ సభ్యులు బొంతల రామకృష్ణారెడ్డి ,సత్యనారాయణ, మహంకాళి మచ్చేందర్, అంతటి స్వప్న, దేవిరెడ్డి సుధాకర్రెడ్డి, జహరబి చిన్నంకవిత, కూరెల్ల జానకి, గుండమల్ల సత్తమ్మ మణెమ్మ, చిర్రగోని సత్తయ్య తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.