Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మండలంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రజాప్రతి నిధులు, అధికారులు అందరూ భాధ్యతగా వ్యవహరించాలని ఎంపీపీీ తొకల వెంకన్న కొరారు. బుధవారం ఆస్పత్రిలో నిర్వహించిన అభివృద్ధి కమిటీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి నిధుల కింద మంజూరైన రూ. 1.92లక్షలను సధ్వినియోగం చేసుకోని ఆస్పత్రికి కావల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ చక్రవర్తి అభివృద్ధి కమిటీ సభ్యులకు ఆస్పత్రి నిర్వహానపైన అవగహాన కల్పించారు. పలు సమస్యలు గుర్తించి ఖర్చు చేయనున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, జెడ్పీటీసీ అన్నపర్తి సంతోష శేఖర్, ఆర్ఐ చాంద్భాష సర్పంచ్ నల్లగంటి మల్లేశ్, దమరి యాదయ్య, లక్ష్మయ్య, ఎంపీటీసీ వెంకటేశం, ఎఏన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.