Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండల కేంద్రంలోని ప్రాధమిక అరోగ్య కేంద్రంలో మునిపాకలకు చెందిన మహిళకు బుధవారం ఎంపీపీ బట్టు అరుణ అయిలేష్, జెడ్పీటీసీ రవీందర్లు కేసీఆర్ కిట్టును అస్పత్రిలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రులలో కాన్పుల శాతాన్ని పెంచే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టరాని ప్రతి ఒక్కరూ ప్రభుత్వాస్పత్రులలోనే కాన్ఫులు చేయించుకోని కేసీఆర్ కిట్లను పొందలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కిరణ్, ఎంపీడీవో జి కాంతమ్మ, టీఆర్ఎస్ నాయకులు బట్టు అయిలేష్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.