Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెలుతుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భారతీచంద్ర గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి రైతులను సంఘటితం చేసేందుకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ప్రతి గ్రామం నుండి 15మంది సభ్యులను ఎన్నుకుంటారు. అందులో ఒకరిని కన్వీనర్గా నియమిస్తారు. గ్రామాల నుండి ఎన్నుకున్న కన్వీనర్లు మండల మండల కన్వీనర్లను ఎన్నుకుంటారు. మండల కన్వీనర్లు జిల్లా కన్వీనర్లను ఎన్నుకుంటారు, జిల్లా కన్వీనర్లు రాష్ట్ర కన్వీనర్ను ఎన్నుకుంటారు. రైతులు పండిచిన పంటలు, ధరలు నిర్ణయించడంలో ఈ కమిటీలు ఉపాయో గప డుతాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తొకల వెంక న్న, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకన్న, కార్మికవిభగం జిల్లా అధ్య క్షులు గర్రం వెంకట్రెడ్డి, సర్పంచ్ నల్లగంటి మల్లేశ్, లక్ష్మయ్య, దమరి యాదయ్య, నాయ కులు కళ్ళేం సురేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, వెంక టేశం, నర్సింహా, ప్రసాద్, చంద్పాష పాల్గొన్నారు.