Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పీఏపల్లి
నల్లగొండ ప్రజల తాగునీటి అవసరాలకు గాను మండలంలోని కోదండాపురంలోని ప్రధాన కాల్వ నుంచి ఉదయసముద్రంకు సీఈ సునీల్కుమార్ నీటిని విడుదల చేశారు. ముందుగా పుట్టంగండిలో నడుస్తున్న అప్రోచ్ కెనాల్ డెజ్జింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ నుంచి పుట్టంగండికి 780 క్యూసెక్కుల నీటిని ఏకేబీఆర్కు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఏకేబీఆర్ నుంచి హైదరాబాద్ జంట నగరాలకు 525 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుతం 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ఫ్లో వస్తుండటంతో మరో మూడు, నాలుగు రోజుల పాటు నీటి ప్రవాహం ఉన్నట్లయితే శ్రీశైలం నుంచి సాగర్కు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ఒకవేళ ఆల్మట్టి నుంచి శ్రీశైలానికి వరదనీరు రాకపోతే శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్చిస్తున్నామన్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి నాలుగున్నర టీఎంసీల నీటిని ఈఎంసీ వారి సహకారంతో నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మరో రెండు టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు ఈఎంసీ వారు కేఆర్ఎంబీ వారికి లేఖలు రాశారన్నారు. సింగూరు నుంచి హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు వారు నీటిని వినియోగిస్తుండటంతో ప్రస్తుతం పుట్టంగండి నుంచి కొంతమేర నీటి విడుదల తగ్గిందన్నారు. ఉదయసముద్రానికి పుట్టంగండి నుంచి 200 క్యూసెక్కుల నీటిని రెండు వారాల పాటు విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ నీటిని వ్యవసాయ రైతులు ఎలాంటి అక్రమాలకు పాల్పడొద్దన్నారు. వ్యవసాయ సాగునీటికి వినియోగించుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్మార్పీ డీఈ నర్సింగరాజు, డీఈ చక్రపాణి, ఏఈఈ మహేందర్, డీఈ కరుణాకర్, ఉమేశ్, నాగయ్య, సురేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.