Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
పట్టణంలో అన్ని వార్డుల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం 15వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు కాలనీ వాసులు వినతిపత్రం సమర్పించారు.
రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యనవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...నల్లగొండకు చెందిన కానిస్టేబుల్ టి. శ్రీనివాసచారి గత రెండు నెలల క్రితం మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు బదిలీపై వచ్చారు. స్థానిక హౌజింగ్బోర్డులో నివాసముంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిన శ్రీనివాసచారి రైల్వేస్టేషన్ సమీపంలోని ట్యాంకుతండా వద్ద రైల్వేట్రాక్పై శవమై కన్పించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని శ్రీనివాసచారి జేబులోనున్న ఐడీ కార్డు ఆధారంగా కానిస్టేబుల్గా నిర్ధారించుకొని కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. రైల్వే ఎస్సై అచ్యుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనారోగ్యం కారణంతోనే..
తనకు అనారోగ్యంగా ఉందని, దాని కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఈ నెల 12న రాసిన సూసైడ్ నోట్ అతని జేబులో లభించింది. రెండు ముక్కలుగా ఉన్న సూసైడ్ నోట్ను రైల్వేపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యాపిల్లల పేర్లు రాసి తనను క్షమించాలని, జ్ఞాపకశక్తిలోపం, అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్లో రాసి ఉంచారు. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయొద్దని, తన పిల్లలను బాగా చూసుకోవాలని కోరాడు. తన ప్రాణమిత్రులైన ఎస్సై శంకర్రెడ్డి, శివకుమార్లు అంత్యక్రియలకు సహకారమందించాలని నోట్లో రాసి ఉంది. అందరినీ వదిలి వెళుతున్నందుకు మన్నించాలని పేర్కొన్నాడు.