Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నార్కట్పల్లి
మండల పరిధిలోని చెర్వుగట్టులోగల శ్రీపార్వతీ జడలరామలింటేశ్వరస్వామీ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీని బుధవారం లెక్కించారు. గట్టుపైన 53రోజులకుగాను రూ. 22,69,296 గట్టుకింద అమ్మవారి ఆలయంలో రూ 2,94,426 మొత్తం రూ 25,63,722 వచ్చాయి. అదేవిధంగా అన్నదాన హుండి ఆదాయం రూ72, 624 వచ్చింది. ఈ హుండిలెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సైకం అంజనారెడ్డి, దేవాదాయశాఖ నల్లగొండ పరిశీలకులు సుమతి, కొండల్రెడ్డి, జూనీయర్ అసిస్టెంట్ దేవస్థాన సిబ్బంది, ఐడిబ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.