Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాక్సిన్ అందక ఇబ్బందులు
- ఎమ్మెల్యే పరామర్శ
నవతెలంగాణ- నార్కట్పల్లి
పిచ్చికుక్క స్వైరవిహరం చేసి తొమ్మిది మందిని గాయపరిచిన సంఘటన మండల పరిధిలోని చెర్వుగట్టులో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక మండల వైద్యాధికారి హర్ష తెలిపిన వివరాల ప్రకారం మల్గ అంబిక, గౌరుబేయి లక్ష్మయ్య, మల్గ శంకరమ్మ, కూకుట్ల యాదయ్య, మందుల చంద్రయ్య, అనంతయ్య, అండాలు, కూకుట్ల నర్సింహా, బాలం సైదులకు కుక్క కరిచినట్టు తెలిపారు. వీరిలో ఇద్దరు మాత్రమే నార్కట్పల్లి ప్రభుత్వాస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోగా మిగతా ఏడుగురు నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కుక్కకాటుకు మందు ఆస్పత్రిలో అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. పిచ్చికుక్క కాటుకు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా వైద్యం చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గాయపడ్డవారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేషం, స్థానిక ఎంపీపీ మల్లికార్జున్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, ప్రభాకర్లు నల్లగొండిపభుత్వాసత్రిలో పరామర్శించారు. డా. హర్ష చెర్వుగట్టుకు వెల్లి గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక సర్వే నిర్వహించారు. కుక్కల పట్ల ,విషజంతువల పట్ట జాగ్రతగా ఉండాలని సూచించారు.
వాక్సిన్ అందక ఇబ్బందులు
కుక్కకాటుకు గురై చికిత్స కోసం వచ్చిన వారికి రెబీస్ వ్యాక్సిస్ ఇవ్వకపోవడంతో బాధితులు ఆంధోళనకు గురయ్యారు. చెర్వుగట్టుకు చెందిన పదిమంది వరకు కుక్కకాటుకు గురయ్యారు. వీరందర్ని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రి తరలించారు. వీరికి గాయాలకు ప్రథమ చికిత్స చేసి వైద్యలు చేతులు దులుపుకున్నారు. రెబీస్ వ్యాధి కాకుండా గాయాలు గురైన వారికి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వాలి. పదిమంది వరకు ఒకే సారి కుక్కకాటుకు గురికావడంతో అందరికి వ్యాక్సిన్ సరిపడా లేదని వైద్యసిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యే వీరేశం, అధికారులు జోక్యం చేసుకుని వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు.