Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15వ రోజూ దీక్షలు
నవతెలంగాణ-క్లాక్టవర్
సెర్ప్లో పనిచేస్తున్న ఎకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్లకు కనీస వేతనాలు రూ.18500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది బుధవారం కలెక్టరేట్ ఎదుట వంటా వార్పు నిర్వహించారు. పలు డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరినా పట్టించుకోనందునే దీక్షలకు దిగినట్లు వారు పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ఉద్యోగులకు భద్రత కోసం ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలన్నారు. క్యాడర్, జాబ్చార్ట్ ఫిక్స్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అంజలి, రాణి, అనురాధ, దుర్గ, భగవాన్, శాంతి, రాజు, షణ్ముఖాచారి, ధనలక్ష్మి, లలిత, హైమావతి, పద్మ పాల్గొన్నారు.