Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
గీత కార్మికులకు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించి, జిల్లాలో కల్లు పరిశ్రమను ఏర్పాటు చేయాలని గీత పనివారల సంగం జిల్లా కార్యదర్శి పబ్బు వీరస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో బుధశారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి నేటి వరకు పెండింగ్ ఎక్స్గ్రేషియాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డులో సర్టిఫికెట్ ద్వారా రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. టెంపరరీ గీత కార్మికులకు రూ.10 వేల నుండి లక్షకు ఎక్స్గ్రేషియాను పెంచాలన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల మనిషి, స్వాతంత్య్ర సమరయోధుడు బొమ్మగాని ధర్మబిక్షం జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి ఆయన జయంతి, వర్థంతులను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాయికింది సైదులు, బొమ్మర బోయిన లాలయ్య, జయరాములు,త మల్లేశం, కాటం వెంకటేశం, నక్క భిక్షం, బంటు బుచ్చయ్య, గుంట రమేష్, ఓగు సురేందర్ ఐతగోని యాదయ్య కొండాపురం యాదయ్య, సీపీఐ టౌన్ కార్యదర్శి లెనిన్ పాల్గొన్నారు.