Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మండలంలోని గుండ్రాపల్లి గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారన్నారు. కాంగ్రెస్, బీజేపీకి మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మంచుకొండ రామ్మూర్తి, సముద్రాల వెంకన్న, నర్సింహ, రావిరాల శ్రీను, యాదగిరి, నరేందర్రెడ్డి, మనోహర్రెడ్డి, దేవదాసు పాల్గొన్నారు.