Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
శాసనసభ ఎన్నికల టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని డీసీసీ ఉపాధ్యక్షుడు జఠంగి వెంకటనర్సయ్య యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 56శాతం ఉన్న బీసీలకు టికెట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పించలేదన్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎంతో మంది సమర్థులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ వివిధ రకాల ప్రలోభాలకు లొంగి టికెట్లు కేటాయించిన్నట్టు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ జఠంగి లక్ష్మమ్మ, నాయకులు బి.ముత్తయ్య, జె.మల్లయ్య పాల్గొన్నారు.