Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పర్యావరణ ఇంజనీర్ కొమ్ము ప్రసాద్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మమత స్కూల్లో స్వచ్ఛ పర్యవేక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాల నుండి క్లాక్టవర్ సెంటర్ వరకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు పారిశుధ్యం, పచ్చదనం పరిశుభ్రత, శ్రమదానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరింగ్ ఇన్స్పెక్టర్లు సురగి శంకర్, పాఠశాల ప్రిన్సిపాల్ భరత్రెడ్డి, తిరుమల్, రాఘవేంద్రచారి, వెంకటేశ్వర్లు, ఆధిత్య పాల్గొన్నారు.