Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
నేడు పట్టణంలోని అఖిల్ ఫంక్షన్హాల్లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగ, ప్రయివేటు అధ్యాపక సదస్సును విజయవంతం చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పీఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తు నిరుద్యోగులను విస్మరించారన్నారు. ఈ సమావేశంలో జి. అనిల్కుమార్, ఏడుకొండలు, జాహంగీర్, ఏసు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.