Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ పట్టణంలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో సుమారు 70 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరాయి. అదే విధంగా మండలంలోని నోముల గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్సీ రాజగోపాల్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. చేరిన వారిలో టీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు బీమనబోయిన లింగరాజు, గ్రామ ఉపసర్పంచ్ కనుకుల అనిత శ్రీనివాసరెడ్డి, నాయకులు బాదిని సోమయ్య, సామా రవీందర్రెడ్డి, మాచర్ల శైలేశ్, కోడదల అనిల్ ఉన్నారు.
కాంగ్రెస్లో చేరిన గార్లపాటి
కేతెపల్లి:మండలంలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన సహకార సంఘం మాజీ చైర్మన్ గార్లపాటి రవీందర్రెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేసి శుక్రవారం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరిన వారిని రాజగోపాల్రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్కాలిక పథకాలను అమలు చేసి ప్రజలను మోసం చేసిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఎక్కడ అమలయ్యాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట్రెడ్డి, నాయకులు జాన్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.