Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నక్కలపల్లి పాఠశాల విద్యార్థుల ప్రదర్శన
నవతెలంగాణ-నార్కట్పల్లి
హాలియా మండలంలోని నిర్మల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభమైన జిల్లా స్థాయి జవహర్లాల్ నెహ్రు సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలో మండలానికి చెందిన నక్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు వర్షపు నీటిని వృథా చేయొద్దు, వర్షపు నీటి వినియోగంపై ప్రదర్శన చేశారు. మానవులకు నిత్యజీవితంలో నీటి సమస్యను అధిగమించేందుకు వర్షపునీటిని ప్రతిచుక్కను భద్రపరుచుకోని తమ నివాస గృహాల్లో, ఇతర వాణిజ్య సంస్థల్లో, గార్డెన్లో, పూలమొక్కలకు, చెట్లకు వినియోగించుకునేలా ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దాసరి మారయ్య సహకారంతో సహఉపాధ్యాయురాలు మారోజు ఉమా, విద్యార్థులు మచ్చగిరి, శివ ప్రదర్శనలో పాల్గొన్నారు.