Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
గ్రామకంఠం భూమిని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈవో వీరబాబు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి గ్రామ కంఠం భూమిని గ్రామానికి చెందిన కొంత మంది ఆక్రమించుకొని ఇండ్లు నిర్మిస్తుండడంతో ఆయన అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నలుగురికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడపడితే అక్కడ రియ ల్టర్లు గ్రామపంచాయతీకి రుసుం చెల్లించకుండా అక్రమంగా వెంచర్లను చేసి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.