Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఓలు, ఎన్నికల సెక్టార్ అధికారులపైన ఉందని మండల ప్రత్యేకాధికారి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక మల్లికార్జున ఫంక్షన్హాల్లో జరిగిన బూత్లెవల్ అవేర్నెస్ గ్రూపు సభ్యులు, మండల ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు, అంగన్వాడీ టీచర్లు, వీఆర్వోలకు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన ఆయన కల్పించి మాట్లాడారు. పోలింగ్ బూత్ల వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. మండలంలో 52 పోలింగ్ కేంద్రాలుండగా వాటి వద్ద బీఎల్ఓలు నేటి నుంచి విధులు నిర్వర్తించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనికి గాను నలుగురు సభ్యులతో టీమ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వికలాంగ ఓటర్లను ఎలక్ట్రోల్ ఓటర్లుగా గుర్తించాలన్నారు. జిల్లా నుంచి పంపించిన పోస్టర్లను పోలింగ్ కేంద్రాల వద్ద అంటించాలన్నారు. ఈ నెల 23 నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి గ్రామంలో తిరిగి ఇంటింటికీ స్లిప్లను పంపిణీ చేయాలన్నారు. అదే విధంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి ఐడీ కార్డులను మంజూరు చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ ప్రేమ్కుమార్, ఎంపీడీఓ బాలకృష్ణ, సెక్టార్ ఎన్నికల అధికారులు జైల్సింగ్, శ్రీనివాసరావు, విజరుమోహన్, ఈఓఆర్డీ కొండల్రెడ్డి, వీఆర్వోలు శంకర్, శ్రీనివాసరెడ్డి, చెన్నమల్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.