Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
అహల్య సాహితీ సంగమం ఆధ్వర్యంలో రూపొందించిన అహల్య సాహితీ సంచికను జిల్లా నోడల్ అధికారి కొండకింది అంజిరెడ్డి, ఎంఈఓ తరి రాము చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహల్యా నదీ తీర ప్రాంతం కళలకు, సాహిత్యానికి నిలయమన్నారు. అహల్య సాహితీ సంగమం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి పున్నా రవీందర్, సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్గౌడ్, సంఘం కవులు సరిత నరేశ్, సాగర్ల సత్తయ్య, రజియా, దివ్యలకిë, శ్రీకళారామ్మూర్తి, చింతరెడ్డి భాస్కర్రెడ్డి, నాగెల్లి సైదులు, బీసీటీయూ జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేశ్ పాల్గొన్నారు.