Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దవూర : ఈ నెల 19న సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నామినేషన్ వేయనున్నట్టు జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఆయన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 21న హాలియాలో జరిగే నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ భారీ బహిరంగసభను విజయ వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ శంకర్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, మాజీ సర్పంచులు అశోక్, చామల సువర్ణ భాస్కర్రెడ్డి, లాలునాయక్ పాల్గొన్నారు.