Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
బహుజనులంతా ఏకమై బీఎల్పీ అభ్యర్థి సౌజన్య కోట్యానాయక్ను గెలిపించాలని బీఎల్ఎఫ్ నియోజకవర్గ నాయకులు కొండేటి శ్రీను కోరారు. శుక్రవారం మండలంలోని ముప్పారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులంతా ఏకమై సీపీఐ(ఎం), ప్రజా సంఘాలు బలపర్చిన బీఎల్పీ అభ్యర్థిని గెలిపించడం వల్ల నియోజకవర్గంలో సామా న్యులకు అండగా ఉంటారన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్, వెంకన్న పాల్గొన్నారు.