Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో విఫల మైందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పాదూరి శశిధర్రెడ్డి, జిల్లా నాయకులు మాలి పురు షోత్తంరెడ్డి విమర్శించారు. శుక్రవారం మండ లంలోని లకిëదేవిగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నో ఏండ్లుగా హమాలీ కూలీలుగా పని చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలూ అందలేదన్నారు. రంగన్నకు ఓటేసి గెలిపిస్తామని, సీపీఐ(ఎం)తోనే కార్మికుల సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రొండి శ్రీనివాస్, అంకెపాక సైదులు పతాని శ్రీను, రాంచంద్రారెడ్డి, సైదులు, నాగయ్య, ఏర్పుల వెంకటయ్య, వెంకన్న, లింగయ్య, లకిë నారాయణ, మిన్నయ్య, గంగాధర్ పాల్గొన్నారు.