Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నాలుగున్నరేండ్లకాలంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు కోరారు. శుక్రవారం పట్టణంలోని వాసవీనగర్, అశోక్నగర్, నందిపహాడ్, తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీనగర్లో గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుసుకొని జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని వివిధ ప్రయివేటు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులు, సిబ్బందిని కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ రూ.200 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ.100 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. ప్రతి వార్డులోనూ సీసీ రోడ్లు, డ్రయినేజీ నిర్మాణ పనులు చేసేందుకు రూ.కోటి కేటాయించానని వివరించారు. మినీ రవీంద్రభారతీ, ఇండోర్స్టేడియం, మినీ ట్యాంకుబండ్, వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పింఛన్ల లబ్దిదారులకు రెట్టింపు ఆర్థికసాయం, నిరుద్యోగభృతి రూ.3 వేలు ఆర్థికసాయం అందించే విధంగా పొందుపర్చామన్నారు. సొంతస్థలాల్లో డబుల్బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5.04 లక్షలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు తిరునగరు భార్గవ్, కౌన్సిలర్లు వంగాల నిరంజన్రెడ్డి, ఇలియాస్, నాయకులు పెద్ది శ్రీనివాస్గౌడ్, అంకతి వెంకటరమణ, జాని, వీరారెడ్డి, ఉదరుభాస్కర్గౌడ్, అమృతం సత్యం, సయ్యద్ మగ్బుల్, ఖాజా, శ్యాంసుందర్రెడ్డి, ఇమ్రాన్, ఖాజా మొయినుద్దీన్, రమేశ్, గంగాధర్, బాలేమియా, దుండిగాల అంజయ్య, నాగరాజు, షోయబ్ పాల్గొన్నారు.