Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్పీ అభ్యర్థి డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య
నవతెలంగాణ-క్లాక్టవర్
పట్టణ శివారు ప్రాంతాలు, విలీన పంచాయతీల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి నిధులు కేటాయిస్తామని బీఎల్పీ అభ్యర్థి డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 24వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పూర్తిగా విఫలం చెందాయన్నారు. జిల్లాలో వేలాది మంది ఇండ్లులేక అద్దె ఇండ్లల్లో ఉంటున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం నియోజక వర్గంలో ఒక్కరికి కూడా డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలవి ప్రచారా ఆర్భాటాలే తప్ప అభివృద్ధి ఉండ దన్నారు. అనంతరం సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎమ్డి.సలీమ్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్లను కొనడం, కాపాడు కోవడంలో టీఆర్ఎస్, కాంగ్రెస్లు పోటీ పడు తున్నాయన్నారు. అభివృద్ధే లేకుండా సంపాదనే ధ్యేయంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పని చేస్తున్నారన్నారు. విద్యావేత్త అయినా అక్కెనపల్లి మీనయ్య నాగలిపట్టిన రైతుగుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డుశాఖ కార్యదర్శి లొడంగి ఉపేందర్, యాదయ్య, జానయ్య, రామ చంద్రయ్య, ధనలక్ష్మీ, శ్రీను, సయ్యద్ హషం, దండంపల్లి సత్తయ్య, పాలడుగు ప్రభావతి, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, సరోజ, నర్సింహ, ఇస్తారి, లింగయ్య, పద్మ, అరుణ, రాములు, చంటి, మంజుల, నరేశ్, శోభన్ పాల్గొన్నారు.