Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎస్సీ, ఎస్టీసబ్ప్లాన్ సాధించిన రంగన్నకు గిరిజనులు తోడుగా నిలవాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవినాయక్, ధర్మానాయక్ కోరారు. శుక్రవారం మండలంలోని బోట్యానాయక్తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన గిరిజన, దళితులకు న్యాయం చేయాలంటే వారి నిధులు వారికే ఖర్చు చేయాలని, అలా కాకుండా పాలకులు నిధులు పక్కదారి పడుతుంటే దాన్ని నివారించాలంటే ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం తేవాలని కోరారు. అలాంటి చట్టం రాకుండా కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నం చేస్తుంటే సబ్ప్లాన్ చట్టం రావాలని మిర్యాలగూడ నుంచి అసెంబ్లీ వరకూ సైకిల్యాత్రచేసి అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సాధించిన ప్రజా నాయకుడు రంగన్న అన్నారు. ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రంగన్నలాంటి పోరాటం చేసే వారు అసెంబ్లీలో ఉటే ఈ రాష్ట్రంలో తాడిత, పీడిత ప్రజల సమస్యలు పరిష్కారమౌతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రవినాయక్, వెంకయ్య, పిల్లుట్ల సైదులు, బాబునాయక్, హుస్సేన్, శ్రీను, బాలాజీ, కిషన్, సత్యనారాయణ, శ్రీను, మోతీలాల్, రాజు పాల్గొన్నారు.