Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ:బువ్వపెట్టిన వారిని ఎన్నటికీ మరిచిపోవద్దని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో 8వ వార్డు బుడిగజంగాల కాలనీకి చెందిన 200మంది, చిన్నఅడిశర్లపల్లికి చెందిన మరో 100 మంది టీఆర్ఎస్లో ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో చేరారు.అనంతరం దేవరకొండ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తా జీతేందర్రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగ్యానాయక్, వెంకటేశ్గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, మారుపాకుల సురేశ్గౌడ్, కేసాని లింగారెడ్డి, బూతరాజు మల్లయ్య, గోపి, వేముల రాజు, బి.కృష్ణ పాల్గొన్నారు.