Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నియోజకవర్గ ఆశాజ్యోతి..ప్రజల మనిషి జానా
నియోజకవర్గ ఆశాజ్యోతి, ప్రజల మనిషి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిక్కల ఇంద్రసేనారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చిల్కాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు పాలించడం చేతకాక జ్యోతిష్యాన్ని నమ్ముకుంటూ కాలాన్ని గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ హద్దులు తెలియని వారు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ జనాన్ని మభ్యపెడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి జానాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆంగోతు భగవాన్నాయక్, నాయకులు వెంకట్రెడ్డి, శాగం పెద్దిరెడ్డి, గౌని రాజారమేశ్, సోమశేఖర్, వెంపటి శ్రీను, పాంపాటి శ్రీను, రావుల శ్రీనివాస్, సుధా కర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, శేఖర్, వెంకటయ్య, భిక్ష మయ్య, రాజయ్య, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.