Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
నాలుగున్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని నకిరేకల్ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం పేర్కొన్నారు. మండలంలోని కొండకిందిగూడెం గ్రామంలో శుక్రవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వీరేశం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి వీరేశం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ సుందర్, చిమట వెంకన్నయాదవ్, ఎంపీటీసీ మట్టి సునీత, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కంచర్ల మహేందర్రెడ్డి, జి.మాధవరెడ్డి, మట్టి సాల్మాన్, పాల్గొన్నారు.
పేద ప్రజలకు అండగా టీఆర్ఎస్
నకిరేకల్:టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేద ప్రజలు లబ్దిపొందారని స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గోరెంకలపల్లి గ్రామంలో సుమారు 30 మంది కాంగ్రెస్కు చెందిన వారు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అందాయన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్రెడ్డి నర్సింహారెడ్డి, నాయకులు నర్సింగ్ శ్రీను, చెట్టుపల్లి భాస్కర్, మన్నెం వీరమల్లు, నర్సింగ్ సైదులు, బండారు ప్రవీణ్, జాజుల సతీశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ను గెలిపించాలి
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ వెంకన్న, నాయకులు వీర్లపాటి రమేశ్, మంగినపల్లి రాజు, రాచకొండ వెంకన్న, పెండెం సదానందం పాల్గొన్నారు.
నార్కట్పల్లి :నకిరేకల్ నియోజకవర్గ టీఆర్ఎస ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశంకు తెలంగాణ కుమ్మరి సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తూ శుక్రవారం ఆ సంఘం నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాధారపు భిక్షపతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మర్ల భవనానికి హైదరాబాద్లో మూడెకరాల స్థలం కేటాయించి రూ.3కోట్లు మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం కుమ్మరలకు చేయని పనులను టీఆర్ఎస్ చేసి అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు రాచకొండ కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు ప్రభాకర్, తాడూరి చంద్రం, రాములు, దశరథ, మల్లేశం పాల్గొన్నారు.