Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లలోనే చర్లగూడెం రిజర్వాయర్ పూర్తి చేస్తా
- ఫ్లొరిన్ రహిత నియోజకవర్గంగా మారుస్తా
- కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
కేసీఆర్ మాయమాటలు మరోసారి నమ్మితే నట్టేట ముంచుతాడని, కేసీఆర్ నియంత పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని చల్మడ, కొంపెల్లి, చీకటిమామిడి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని సత్యఫంక్షన్లో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రాష్ట్రంలో వందమంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కానుకగా ఇవ్వడానికి సిద్ధమయ్యామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. డిసెంబర్ 13న కెేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితమయ్యేలా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలోని గడపగడప తట్టి ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ గెలిచిన రెండేండ్లకే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి సాగునీరు అందిస్తామన్నారు. చర్లగూడెం రిజర్వాయర్ను రెండేండ్లలో పూర్తి చేసి అన్ని మండలాలకు సాగునీరు అందించి ఫ్లోరిన్ రహిత నియోజకవర్గం మారుస్తానని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ, రూ.2వేల పింఛన్లు, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, ఇండ్లు నిర్మించుకో వడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తామ న్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకు డిగా కాదు సేవకుడిగా పనిచేస్తానన్నారు. అందుకు ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వంగాల స్వామిగౌడ్, మైనార్టీసెల్ నాయకుడు హఫీజ్ఖాన్, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి కైలాస్ నేత, రాష్ట్ర నాయకుడు వేంరెడ్డి సుందరుడు, చండూరు మార్కెట్ మాజీ చైర్మన్ పాల్వాయి రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ ముంగి చంద్రకళ, మండల అధ్యక్షుడు జాల వెంకన్నయాదవ్, జడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, నన్నూరు విష్ణువర్దన్రెడ్డి, వేంరెడ్డి జితేందర్రెడ్డి, బొజ్జ శ్రీనివాస్రెడ్డి, మేకల రామస్వామి, జిల్లా ఉపాధ్య క్షుడు బండారి యాదయ్య, పందుల భాస్కర్, యూత్కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మేకల ప్రమోద్రెడ్డి, భువనగిరి పార్లమెంట్ కార్యదర్శి పాల్వాయి జితేందర్రెడ్డి, ఎమ్డి. అన్వర్, మల్లయ్య, పాలకూరి యాదయ్యగౌడ్, మాదగోని రాజేష్ గౌడ్, బోయపర్తి ప్రసాద్ పాల్గొన్నారు.
చండూరు:కేసీఆర్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండ లంలోని భవాని ఫంక్షన్హాల్లో మండల స్థాయి ముఖ్యకర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. అంతకుముందు కళాకారులు, డప్పులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనం తరం కార్యకర్తలు భారీ గజమాలతో సన్మానిం చారు. వివిధ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ లో చేరారు. చేరిన వారిలో జడ్పీటీసీ అన్నెపర్తి సంతోశశేఖర్, మాజీసర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. ఎమ్డి సుజావుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి ఇడం కైలాసం, రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్రెడ్డి, వంగాల స్వామిగౌడ్, కర్నాటి వెంకటేశం, కల్మికొండ జనార్దన్, కోడి గిరిబాబు పాల్గొన్నారు.