Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి
నవతెలంగాణ-నకిరేకల్
ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను ఓడించి నిజాయితీ గల సీపీఐ(ఎం), బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవన్లో విలేకర్లతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు నిరుద్యోగ యువతను, ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి, అరాచక శక్తులను ఎన్నికల్లో మట్టికరిపించాలన్నారు. నియోజక వర్గంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మామిడి సర్వయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్బెడ్రూం ఇండ్లు, మూడెకరాల భూపంపిణీ చేయడంలో చిత్తశుద్ధి లోపించిందన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిషలు పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్థి జిట్టా నగేశ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిట్టా నగేశ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల, సీనియర్ నాయకులు బోళ్ల నర్సింహారెడ్డి, ఎస్సార్ వెంకటేశ్వర్లు, అవిశెట్టి శంకరయ్య, బొజ్జ చిన్నవెంకులు, ఆకుల భాస్కర్, లకపాక రాజు, గాలి నర్సింహ, జల్లెల పెంటయ్య పాల్గొన్నారు.